వంద గొర్రెలు మృత్యువాత | 100 sheeps died in ramadurgam | Sakshi
Sakshi News home page

వంద గొర్రెలు మృత్యువాత

Mar 12 2017 12:14 AM | Updated on Sep 5 2017 5:49 AM

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం సమీపంలో కాలువ దాటుతూ వంద గొర్రెలు శనివారం రాత్రి 8 గంటలకు మృత్యువాతపడ్డాయి.

చిప్పగిరి : కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం సమీపంలో కాలువ దాటుతూ వంద గొర్రెలు శనివారం రాత్రి 8 గంటలకు మృత్యువాతపడ్డాయి. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామానికి చెందిన కాపరులు అణిగిరి నారాయణప్ప, ఆదెప్ప, నరసింహప్ప, ప్రభాకర్, బండి నారాయణప్ప తదితరులు 3 వేల గొర్రెలను మేత కోసం వలస వెళ్లారు. చిప్పగిరి మండలం రామదుర్గం ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌(ఏబీసీ) అడ్డు రాగా దాన్ని దాటే ప్రయత్నంలో గొర్రెలు ఒకదానికొకటి పడి కాలువలో మృతి చెందాయి. ఘటనతో రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement