పార్టీకి పిలిచి చంపేశారు | youth killed by friends | Sakshi
Sakshi News home page

పార్టీకి పిలిచి చంపేశారు

Jan 3 2018 4:08 PM | Updated on Jan 3 2018 4:08 PM

youth killed by friends - Sakshi

సాక్షి, రామనగర(దొడ్డబళ్లాపురం): స్నేహితుడుని పార్టీకి పిలిచి కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని మాగడి తాలూకా కొండళ్లి వద్ద బుధవారం చోటుచేసుకుంది. 

రామనగర తాలూకా రామనహళ్లికి చెందిన పుట్టరాజు(33), శ్రీనివాస్‌ స్నేహితులు. స్నేహితులందరం పార్టీ చేసుకుంటున్నామని, నువ‍్వు కూడా రావాలని శ్రీనివాస్‌ అనే వ‍్యక్తి పుట‍్టరాజును కోరాడు. దాంతో పుట‍్టరాజు ఈ విషయం ఇంట్లో చెప్పి తన స్విఫ్ట్‌ కారులో వెళ్లాడు.

మీ తమ‍్ముడు పుట‍్టరాజును చంపేశాం, వచ్చి శవాన్ని తీసుకుపోవాలని పుట‍్టరాజు సోదరుడు లింగరాజుకు శ్రీనివాస్‌ బుధవారం మధ్యాహ‍్నం ఫోన్‌చేశాడు. లింగరాజు హుటాహుటిన కొండళ్ళి వద‍్దకు వెళ‍్ళి చూడగా కారు వెనుక సీట్లో సోదరుడు పుట‍్టరాజు విగతజీవుడై పడిఉన్నాడు. దాంతో విషయాన్ని మాగడి పోలీసులకు తెలియజేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement