తల్లి మందలించిందని గొంతు కోసుకున్న యువతి

Young Woman Cuts Her Neck With Knife - Sakshi

సాక్షి, కృష్ణా : తల్లి మందలించిందని ఓ యువతి బ్లేడుతో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శనివారం నూజివీడు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నూజివీడు మండలం వెంకటాపురంతండా గ్రామానికి చెందిన సౌజన్య గత నాలుగు రోజులుగా కాలేజీకి వెళ్లడం లేదు. ఈ క్రమంలో తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన సౌజన్య బ్లేడుతో మెడ కొసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌజన్య నూజీవీడు జీఎమ్‌ఎచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top