రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Road Accident In Nizamabad District People Lost Life - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి మండలంలోని మెంట్రాజ్‌పల్లి నాకాతండా వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బీహార్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. మృతులు కేరళలోని కోజికోడ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top