వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్‌ దాడి

Petrol Attack On Degree Student In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాలు... రవళి అనే యువతి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ఆమె స్వస్థలం సంగెం మండలం రామచంద్రాపురం. ఈరోజు(బుధవారం) కాలేజీకి వెళ్తున్న సమయంలో.. సాయి అన్వేష్‌ అనే యువకుడు ఆమెపై పెట్రోల్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రవళి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

కాగా దాడికి పాల్పడ్డ అన్వేష్‌ కూడా వాగ్దేవి కాలేజీలోనే చదువుతున్నాడు. ఇంతటి అమానుషానికి ఒడిగట్టిన అతడికి దేహశుద్ధి చేసిన తోటి విద్యార్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top