లక్కీడ్రా పేరిట ఘరానా మోసం.. | Diamond Enterprizes Fraud to peoples in Hyderabad | Sakshi
Sakshi News home page

లక్కీడ్రా పేరిట ఘరానా మోసం..

Sep 28 2017 6:33 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌: ప్రజలకు ఆశ చూపించి కొందరు వారి వద్ద నుంచి లక్కీ డ్రా పేరిట నగదు వసూలు చేస్తున్నారు. ఈ విధమైన సంఘటన నగరంలో  కేపీహెచ్‌బీలో చోటుచేసుకుంది. వివరాలివి.. కొందరు డైమండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. లక్కీడ్రా పేరుతో ప్రజలకు ఆశ చూపించి 800 మంది వద్ద నుంచి  దాదాపుగా రూ. 20 లక్షల నగదు వసూలు చేశారు.

భారీగా నగదు సేకరించిన డైమండ్‌ ఎంటర్‌ప్రైజెస్ బోర్డు తిప్పేసింది. విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోసానికి పాల్పడిన ముగ్గురి నిర్వాహకులను అరెస్టు చేసి, రిమాండ్‌ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement