ఈఎస్‌ఐ స్కాం.. దూకుడు పెంచిన ఏసీబీ

ACB Conducts Raids Over ESI Scam In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచింది. మందుల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి పలువురు నివాసాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ. 10 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ అధికారుల నివాసాలతో పాటు 21చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. డైరెక్టర్‌ దేవికారాణి, వరంగల్‌ జేడీ పద్మ, స్టోర్స్‌ ఏడీ వసంత, ఓమ్నీ మెడికల్‌ సిబ్బంది, తేజా ఫార్మా ఉద్యోగి భాస్కర్‌రెడ్డి, ఓ ఛానల్‌ రిపోర్టర్‌ నివాసంతోపాటు 21 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top