
ముంబైలో జనవరి 19 నుంచి ప్లాస్టివిజన్ ఎగ్జిబిషన్
అఖిల భారత ప్లాస్టిక్స్ ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు ప్లాస్టివిజన్ ఇండియా-2017 ప్రదర్శన ముంబైలోని బోంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది.
ముంబై: అఖిల భారత ప్లాస్టిక్స్ ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు ప్లాస్టివిజన్ ఇండియా-2017 ప్రదర్శన ముంబైలోని బోంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. ప్రపంచంలో జరిగే టాప్ 5 ఎగ్జిబిషన్లలో ఇది కూడా ఒకటి. దీని కోసం 1500 మంది ఎగ్జిబిటర్లు ఇప్పటికే స్టాల్స్ను బుక్ చేసుకున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ అతిపెద్ద ప్రదర్శనలో 25 దేశాలకు చెందిన వారు పొల్గొననున్నారు. ప్లాస్టిక్ రంగంలో నూతనరకం టెక్నాలజీ, మెషినరీకి ఈ కార్యక్రమం వేదిక కానుంది.