రూ.47,000 వద్ద స్థిరంగా పసిడి ధర

today gold price - Sakshi

మంగళవారం బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 10:22 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్లో శుక్రవారంతో పోలిస్తే 10 గ్రాముల పసిడి ధర రూ.14పెరిగి రూ.47,051 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,731.85 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయంగా ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగానే ఉండడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అందువల్ల బంగారం ధర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top