రూ.47,000 వద్ద స్థిరంగా పసిడి ధర | today gold price | Sakshi
Sakshi News home page

రూ.47,000 వద్ద స్థిరంగా పసిడి ధర

May 26 2020 10:41 AM | Updated on May 26 2020 10:42 AM

today gold price - Sakshi

మంగళవారం బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 10:22 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్లో శుక్రవారంతో పోలిస్తే 10 గ్రాముల పసిడి ధర రూ.14పెరిగి రూ.47,051 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,731.85 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయంగా ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగానే ఉండడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అందువల్ల బంగారం ధర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement