ఎయిరిండియా టిక్కెట్ ఇంత తక్కువకా! | Air India Offers 'Saavan Special' Sale With Tickets Starting Rs. 706 | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా టిక్కెట్ ఇంత తక్కువకా!

Jun 17 2017 5:21 PM | Updated on Sep 5 2017 1:52 PM

ఎయిరిండియా టిక్కెట్ ఇంత తక్కువకా!

ఎయిరిండియా టిక్కెట్ ఇంత తక్కువకా!

దేశీయ ప్యాసింజర్ క్యారియర్ ఎయిరిండియా అన్ని విమానయానసంస్థల కంటే తక్కువ ధరలకు మాన్ సూన్ సేల్ ప్రకటించింది.

దేశీయ ప్యాసింజర్ క్యారియర్ ఎయిరిండియా అన్ని విమానయానసంస్థల కంటే తక్కువ ధరలకు మాన్ సూన్ సేల్ ప్రకటించింది. ఎంపికచేసిన దేశీయ రూట్లలో కేవలం 706 రూపాయలకే టిక్కెట్లను విక్రయించనున్నట్టు పేర్కొంది. ''సావాన్ స్పెషల్'' సేల్ ను మాన్ సూన్ సందర్భంగా ఎయిరిండియా తీసుకొచ్చింది. ఈ సేల్ జూన్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు మధ్యలో ప్రయాణాలకు ఈ టిక్కెట్ ధరలు వర్తిస్తాయి. ఎయిరిండియా బుకింగ్ ఆఫీసులు,  www.airindia.in వెబ్ సైట్, ఎయిరిండియా మొబైల్ అప్లికేషన్, అధికారిక ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్న ఎయిరిండియా విమానాలకు ఇవి వర్తిస్తాయని తెలిపింది. ఎంపికచేసిన దేశీయ రూట్లలో వీటిని ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది.
 
ఎయిరిండియాకు ముందు స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ , విస్తారాలు మాన్ సూన్ సేల్ లు ప్రకటించాయి.  ఈ సేల్ లో భాగంగా స్పైస్ జెట్ రూ.799కు టిక్కెట్ ధరలను విక్రయిస్తుండగా, ఇండిగో ఎంపికచేసిన రూట్లలో రూ.899కు టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ రూ.899కు, విస్తారా రూ.849కు టిక్కెట్లను విక్రయిస్తోంది. విమానయాన సంస్థలు ఆఫర్ చేస్తున్న ఈ డిస్కౌంట్ ధరలతో గతేడాది కంటే  ఈ ఏడాది మాన్ సూన్ ప్రయాణాలు 27 శాతం వృద్ధిని నమోదుచేశాయని ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్ క్లియర్ ట్రిప్ లో తెలిసింది. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement