'హామీలు గుర్తు చేస్తే గొంతు నొక్కుతున్నారు' | YSRCP MLAs takes on Chandrababu govt | Sakshi
Sakshi News home page

'హామీలు గుర్తు చేస్తే గొంతు నొక్కుతున్నారు'

Mar 17 2015 10:07 AM | Updated on May 29 2018 2:55 PM

ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆరోపించారు.

హైదరాబాద్: ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పుష్పశ్రీవాణి మాట్లాడుతూ...అంగన్వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆమె నిప్పులు చెరిగారు.

అంగన్వాడీ కార్యకర్తల అరెస్ట్లు చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు సర్కార్ను మరో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఈశ్వరి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement