నేడు ఢిల్లీకి వైఎస్ విజయమ్మ
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన కోసం తమ పదవులను త్యాగం చేసి ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద అమరణ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం పరామర్శించనున్నారు.
వీరితోపాటు ఆస్పత్రిలో ఉన్న మేకపాటి రాజమోహన్రెడ్డిని ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్నందున ఆయన తరఫున విజయమ్మ ఢిల్లీకి వస్తున్నారని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.