248వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Prajasankalpayatra 248th Day Schedule Released - Sakshi

సాక్షి, యలమంచిలి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 248వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం జంక్షన్‌, తిమ్మరాజు పేట, పెద్దపాడు క్రాస్‌ మీదుగా మునగపాక రోడ్డు(బ్రిక్‌ యూనిట్‌) వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ 247వ రోజు పాదయాత్ర సోమవారం కొండకర్ల క్రాస్‌ వద్ద ముగిసింది. నేడు అచ్చుతాపురం శివారు నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్‌, సాని కాలువ, చీమలపల్లి, బంగారం పల్లి క్రాస్‌ మీదుగా కొండకర్ల క్రాస్‌ వరకు 7.9 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2826.9 కిలోమీటర్లు నడిచారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top