234వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 234వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగింది. రాజన్న తనయుడు శనివారం ఉదయం నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను తుని నియోజకవర్గంలో ప్రారంభిస్తారు. కొత్త వేలంపేట, సీతయ్య పేట, లోవ కొత్తూరు, తల్లూరు జంక్షన్, జగన్నాథగిరి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు. భోజన విరామ సమయం తరువాత తునిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.