231వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ | Ys jagan Padayatra 231th Day Schedule Released | Sakshi
Sakshi News home page

Aug 6 2018 8:15 PM | Updated on Aug 7 2018 7:22 AM

Ys jagan Padayatra 231th Day Schedule Released - Sakshi

సాక్షి, పత్తిపాడు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 231వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. జననేత పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు మంగళవారం ఉదయం శంఖవరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి శృంగవరం, బంగారయ్య పేటక్రాస్‌ మీదుగా రౌతులాపుడి వరకు కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర.. వైఎస్‌ జగన్‌ 230వ రోజు పాదయాత్ర శంఖవరంలో ముగిసింది. నేడు జననేత 10.8 కిలోమీటర్లు నడిచారు. నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం క్రాస్‌ మీదుగా శంఖవరం వరకు పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు వైఎస్‌ జగన్‌ మొత్తం 2,666.9 కిలోమీటర్లు నడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement