'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు' | Women, Farmers will teach lesson for chandrababu Naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు'

Aug 1 2014 6:53 PM | Updated on Oct 1 2018 2:03 PM

'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు' - Sakshi

'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌కే పరిమితమైన చంద్రబాబు పల్లె బాట పడితే రైతులు, మహిళలు తగిన గుణపాఠం చెబుతారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. 
 
ఎన్నికల ప్రచారంలో రైతులకు 9 గంటల విద్యుత్‌ ఇస్తానని చేసిన వాగ్గానం తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన రైతులకు కనీసం 4 గంటల విద్యుత్‌ కూడా ఇవ్వడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement