
'పోలీసులే నన్ను దొంగగా మార్చారు'
ఘరానా మహిళా దొంగ చెంచులక్ష్మి పోలీసులకు చిక్కింది. పలు దొంగతనాలతో సంబంధమున్న ఆమెను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజేంద్రనగర్: ఘరానా మహిళా దొంగ చెంచులక్ష్మి పోలీసులకు చిక్కింది. పలు దొంగతనాలతో సంబంధమున్న ఆమెను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 11 తులాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
జంట నగరాల్లో ఆమెపై 50పైగా కేసులున్నాయి. రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో తాళాలు వేసి వున్న ఇళ్లలో ఆమె చోరీలకు పాల్పడిన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులే తనను దొంగగా మార్చారని చెంచులక్ష్మి ఆరోపించింది.