సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్లకు ఎన్నికల నిర్వహణపై గురువారం స్పష్టత రానుంది. ఎన్నికలకు సంబంధించి ఆ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 17నే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు స్టే కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ.. ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిపై 30వ తేదీ (గురువారం) విచారణ జరగనుంది. 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా.. 50 శాతానికే పరిమితం చేయాలా.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలు హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులు చెప్పారు.
50 శాతానికి పరిమితం చేస్తే బీసీలకు తగ్గనున్న పదవులు
పంచాయతీరాజ్ ఎన్నికల్లో వివిధ పదవులకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లను హైకోర్టు 50 శాతానికి పరిమితం చేస్తే ఆ మేరకు 9.85 శాతం రిజర్వేషన్లను బీసీలకు తగ్గించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం.. ఎస్టీ, ఎస్సీలకు రాష్ట్రంలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం 6.77 శాతం ఎస్టీలకు, 19.08 శాతం ఎస్సీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు పోగా బీసీలకు 24.15% మేర రిజర్వేషన్లు కల్పించడానికి వీలుందని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కీలక అధికారి ఒకరు చెప్పారు. కాగా, 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలపై రేపు స్పష్టత
Published Wed, Jan 29 2020 4:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement