బైక్ - ట్రాక్టర్ ఢీ: ముగ్గురు విద్యార్థులు మృతి | three students killed in road accident in kurnool district | Sakshi
Sakshi News home page

బైక్ - ట్రాక్టర్ ఢీ: ముగ్గురు విద్యార్థులు మృతి

Mar 16 2016 8:29 AM | Updated on Aug 30 2018 4:07 PM

కర్నూలు జిల్లా అవుకు మండలం శింగనపల్లి సమీపంలో బుధవారం ఉదయం బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది.

కర్నూలు : కర్నూలు జిల్లా అవుకు మండలం శింగనపల్లి సమీపంలో బుధవారం ఉదయం బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతులు డిగ్రీ విద్యార్థులని మృతదేహాల వద్ద లభించిన హాల్ టికెట్ల ఆధారంగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులుకు సమాచారం అందించారు. పరీక్షలు రాసేందుకు కోయిలకుంట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement