ముగ్గురు యువకుల దుర్మరణం | Three killed in car accident | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువకుల దుర్మరణం

Aug 24 2013 7:16 AM | Updated on Aug 30 2018 3:56 PM

అతివేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.

వైరా, న్యూస్‌లైన్: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఇదే సంఘటనలో మరో ముగ్గురికి గాయా లు కాగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృ తులు, క్షతగాత్రులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్నేహితు లు. స్నేహితుని సోదరుని వివాహానికి హాజరయ్యేందుకు వీ రంతా వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు....
 
  సికింద్రాబాద్‌కు చెందిన కోణతం వరుణ్‌కృష్ణ సోదరుడు వంశీ వివాహం సత్తుపల్లికి చెందిన శ్రావణితో శనివారం తెల్లవారుజామున జరగనుంది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు వరుణ్‌కృష్ణ, అతని స్నేహితులు వచ్చారు. పెళ్లి కుమారుడు వంశీకి ఖమ్మంలోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఒడుగు చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్‌కృష్ణ, ఆయన స్నేహితులు హాజరయ్యారు. ఇది ముగిసిన తర్వాత ఖమ్మం నుంచి పెళ్లికొడుకు కారు బయలుదేరాక   వెనుక స్నేహితులందరూ మరో కారులో సత్తుపల్లి బయలుదేరారు.
 
 అతివేగంగా వస్తున్న వీరి కారు వైరా మండలం  స్టేజి పినపాక వద్ద   రోడ్డు ఎడమ వైపు నుం చి ఒక్కసారిగా కుడివైపుకు వచ్చి రోడ్డు పక్కనే ఉన్నచెట్టును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కడపకు చెందిన యూటీఎఫ్ జిల్లా నాయకుని కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బీరం శ్రీధర్‌రెడ్డి(30), ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన బాలా ప్రదీప్(31) అక్కడికక్కడే మృతిచెందారు.  ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కారులో ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనంలో ఖమ్మం తరలించారు.  బెల్లంపల్లికి చెందిన కిరణ్ (30) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేవిధంగా సికింద్రాబాద్‌కు చెందిన కోణతం వరుణ్‌కృష్ణ, వరంగల్‌కు  చెందిన హరిలకు తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న కిరణేశ్వర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మృతిచెందిన వారిలో బీరం శ్రీధర్‌రెడ్డి చెన్నైలో, కిరణ్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తుండగా, బాలా ప్రదీప్ బెల్లంపల్లిలో వ్యాపారం చేస్తున్నాడు. గాయడిన వరుణ్‌కృష్ణ అమెరికాలో, హరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
 
  ప్రమాద వార్త తెలుసుకున్న వైరా డీఎస్పీ బత్తిన సాయిశ్రీ, వైరా ఎస్సై తుమ్మా గోపి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.  పోలీసులు మృతుల వద్ద ఉన్న ఫోన్లు, గుర్తింపు కార్డుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు బంధువులు హుటాహుటిన అక్కడకు వచ్చారు. ప్రమాదం జరగటంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఖమ్మంకు తరలించారు. సిరిపురం గ్రామ రెవిన్యూ అధికారి సాంబశివరావు ఫిర్యాదు మేరకు వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement