హోటల్లో నిద్రించిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
హోటల్లో నిద్రించిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం కండ్రిగ గ్రామంలో సూరవరపు పట్టాభిరామయ్య (55) సోదరులతో కలిసి హోటల్ నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి అతడు హోటల్ లో నిద్రించగా.. తెల్లవారు జామున చూసే సరికి మంచంపై ప్రాణాలు కోల్పోయి.. కనిపించాడు. తలపై బలమైన గాయాలు ఉండటంతో బండరాయితో కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.