శ్రీవారి సేవలో న్యాయమూర్తులు | Srivari the service of the judges | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

Apr 13 2015 1:36 AM | Updated on Sep 3 2017 12:13 AM

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. శంకర్‌నారాయణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

సాక్షి, తిరుమల: రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. శంకర్‌నారాయణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత ఆలయానికి విచ్చేసిన వీరికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి  ప్రసాదాలు అందజేశారు. తరువాత జస్టిస్ శంకర్‌నారాయణ కుటుంబసమేతంగా తిరుచానూరు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకుని, కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement