సమైక్యాంధ్ర పరి రక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే బంద్ను విజయవంతం
సమైక్యాంధ్ర కోసం నేడు జిల్లా బంద్
Jan 3 2014 3:49 AM | Updated on May 25 2018 9:12 PM
ఏలూరు, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర పరి రక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకూ తమ పార్టీ అలుపెరగకుండా పోరాడుతోందన్నారు. ఇందులో భాగంగా జరిగే బంద్లో అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సమైక్య వాణిని విని పించాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement