బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన సాయి శిరీష | sai sirisha appears in banjara hills police station | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన సాయి శిరీష

Aug 20 2013 5:58 PM | Updated on Sep 4 2018 5:07 PM

బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన సాయి శిరీష - Sakshi

బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైన సాయి శిరీష

నాలుగురోజుల క్రితం అదృశ్యమైన నటి సాయి శిరీష మంగళవారం బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైంది.

హైదరాబాద్ : మూడు నెలల క్రితం అదృశ్యమైన నటి సాయి శిరీష మంగళవారం బంజారాహిల్స్‌లో ప్రత్యక్షమైంది. తల్లి దండ్రుల వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని వెల్లడించింది.  తన స్నేహితుల వద్దే తలదాచుకున్నానని తెలిపింది.  ఆమెపై అదృశ్యం కేసు నమోదు కావడంతో బంజారాహిల్స్‌లో పోలీసులు కోర్టుకు తరలించారు. ఆమెను నింబోలి అడ్డ రెస్క్యూ హోంకు తరలించాలని  పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 
సాయి శిరీష నాటకీయ ఫక్కిలో  సోమవారం రాత్రి టెలివిజన్ చానెల్ లో కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు. సవతి తండ్రి నీల ప్రసాద్ రావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని శిరీష ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వూలో వెల్లడించడం సంచలనం రేపింది.  లవ్ ఎటాక్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన హర్షిత అదృశ్యమైనట్టు సవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నాలుగు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. మే 27న షూటింగ్కు  వెళ్లిన తమ అమ్మాయి జాడ తెలియడం లేదని  ఫిర్యాదులో  పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement