ఎర్రచందనం అమ్మితే వచ్చేది రూ.2వేల కోట్లే | Rs 2 crore from the sale of redwood | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం అమ్మితే వచ్చేది రూ.2వేల కోట్లే

Aug 7 2014 3:06 AM | Updated on Sep 2 2017 11:28 AM

ఎర్రచందనం అమ్మితే వచ్చేది రూ.2వేల కోట్లే

ఎర్రచందనం అమ్మితే వచ్చేది రూ.2వేల కోట్లే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం మొత్తం అమ్మితే కేవలం రూ.2వేల కోట్లే వస్తుందని, ఇది రుణమాఫీకి సరిపోదని, వనరుల కోసం ప్రత్యామ్నాయాలపై కమిటీ కసరత్తు చేస్తోందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

ఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం మొత్తం అమ్మితే కేవలం రూ.2వేల కోట్లే వస్తుందని, ఇది రుణమాఫీకి సరిపోదని, వనరుల కోసం ప్రత్యామ్నాయాలపై కమిటీ కసరత్తు చేస్తోందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రైతుల రుణమాఫీ అమలు చేసేందుకు మరో రెండు నెలల సమయం పడుతుందన్నారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా బ్యాంకులు సహకరించడం లేదన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రైతుల రుణమాఫీపై తొలి నుంచీ వ్యతిరేకంగానే ఉందని ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement