లోకేష్కు మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదు | Raghuveera reddy takes on chandrababu, lokesh | Sakshi
Sakshi News home page

లోకేష్కు మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదు

Oct 7 2014 2:29 PM | Updated on Jul 28 2018 3:23 PM

లోకేష్కు మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదు - Sakshi

లోకేష్కు మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదు

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కుప్పంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో లోకేష్ ఎలా పాల్గొంటారని రఘువీరా ప్రశ్నించారు. లోకేష్కు మంత్రి పదవి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అన్నారు. చంద్రబాబు కూడా ఒకప్పడు రాజ్యాంగేతర శక్తిగానే టీడీపీలో రాజకీయాలు నడిపారని ఆరోపించారు.

కాంగ్రెస్ హయాంలో మేఘమథనంలో అవినీతి జరిగిందని ఆరోపించిన చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. చంద్రబాబు మాదిరిగా తాను కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోనని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 12 లక్షల పెన్షన్లను తొలగించారని రఘువీరా రెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement