
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 33వ రోజుకి చేరుకుంది. నేడు రాప్తాడు నియోజకవర్గం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి వైఎస్
జగన్ పాదయాత్రను ప్రారంభించారు. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకుంటారు. అక్కడ ఆయన పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆయన జనంతో మమేకం కానున్నారు. ఆపై వైఎస్సార్ కాలనీ, అక్కంపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నాం భోజన విరామనంతరం తిరిగి పాదయాత్ర చేపడతారు. సాయంత్రం పాపంపేట వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. కాగా, ఇప్పటిదాకా ఆయన 451.7 కిలోమీటర్లు నడిచిన విషయం తెలిసిందే.