పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించనుందని ఇంట ర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ (ఐఫాడ్) అధ్యక్షుడు కినాయో ఎఫ్.నువాన్జే తెలిపారు.
హైదరాబాద్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించనుందని ఇంట ర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ (ఐఫాడ్) అధ్యక్షుడు కినాయో ఎఫ్.నువాన్జే తెలిపారు. ఇక్కడి ఇక్రిశాట్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత, పౌష్టికాహారంతోపాటు వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఐరాస వచ్చే ఏడాది సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందన్నారు. అందులో 17 ముఖ్యాంశాల్ని గుర్తించగా, గ్రామీణ ప్రాంతాల్లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేయనున్నట్టు వివరించారు. ‘మిలీనియం డెవలప్మెంట్ గోల్స్’కు పొడిగింపుగా ఈ కొత్త లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు చెప్పారు.
వచ్చే నెలలో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో సెక్రటరీ జనరల్ దీనిపై ఒక ప్రకటన చేయనున్నారన్నారు. ఐరాస నేతృత్వంలోని ఐఫాడ్ వ్య వసాయాభివృద్ధి, గ్రామాల్లో పేదరిక నిర్మూలన పథకాలకు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.