వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం | oldage couple suicide attempt in ananthapur district | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

Aug 25 2015 7:44 AM | Updated on Sep 3 2017 8:07 AM

ప్రభుత్వం నుంచి నెలనెలా అందే వృద్ధాప్య పింఛను ఆగిపోయిందని, ఇంటి పట్టా రద్దు అయిందన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

అనంతపురం: ప్రభుత్వం నుంచి నెలనెలా అందే వృద్ధాప్య పింఛను ఆగిపోయిందని, ఇంటి పట్టా రద్దు అయిందన్న మనస్తాపంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా గుంతకల్లు మునిసిపల్ కార్యాలయం ఎదుట జరిగింది. శ్రీనివాసులు(65), భానుమతి 12వ వార్డులో ఉండేవారు.

టీడీపీ కౌన్సిలర్ అంజద్ మస్తాన్ యాదవ్ తమకు వచ్చే ఫించనుతో పాటు, ఇంటి పట్టాను రద్దు చేయించాడంటూ పురుగుల మందు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement