వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం ...
చిన్నా పెద్దలతో సహా తరలివచ్చిన చిరుమామిళ్ల గ్రామం
ఘనంగా మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహావిష్కరణ
చిలకలూరిపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు నీరాజనం పలికారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన జగన్కు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదురేగి స్వాగతం పలికారు. గ్రామగ్రామాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం నుంచే రోడ్లపై జగన్ కోసం బారులు తీరారు. జగన్ చిరుమామిళ్ల వెళ్లే మార్గం కిక్కిరిసి పోయింది. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా మారింది. యడ్లపాడు, బోయపాలెం, లింగారావుపాలెం, చిరుమామిళ్ల గ్రామాల్లో జగన్ రాకను స్వాగతిస్తూ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆబాలగోపాలం దారి పొడువునా బారులు తీరారు. జగన్ కోసం గ్రామాల్లో వేలాది వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. బోయపాలెం నుంచి చిరుమామిళ్ల వరకు మోటార్బైకులతో యువకులు ర్యాలీ నిర్వహించారు. జననేత కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, అభిమానులు, మహిళలు నాదెండ్ల మండలం చిరుమామిళ్ల చేరుకున్నారు. పొలం పనుల నుంచి వచ్చే కూలీలు, పాఠశాలల నుంచి విద్యార్థులు, చూడాలని వచ్చిన చిన్నారులు, వైఎస్ వల్ల లబ్ధిపొందిన పలువురు మహిళలు విశేషంగా తరలివచ్చారు. జగన్కు అడుగడుగునా అభిమానం అడ్డుపడింది. పూలవాన కురిపిస్తూ, భారీ స్థాయిలో బాణసంచా కాలుస్తూ అభిమానులు సందడి చేశారు. జగన్ ప్రయాణించిన మార్గం అంతా పూలతో నిండిపోయింది.
నాడు షర్మిలకు..నేడు జగన్కుచిరుమామిళ్ల ప్రజల ఆత్మీయ స్వాగతం ...
2013 మార్చి 12 .. మరో ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో షర్మిల పర్యటించారు. నాదెండ్ల మండల పర్యటలో ఉన్నప్పుడు మహిళలు తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. రూట్ మ్యాప్ ప్రకారం యాత్ర కొనసాగుతుందని, అయినా చిరుమామిళ్ల వస్తానని చెప్పిన మాటను షర్మిలమ్మ నిజం చేసి దివంగత నేత వైఎస్ఆర్, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాల పక్కనే ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాల కోటిరెడ్డి విగ్రహాన్ని జననేత జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించటం విశేషం.
నీరాజనం
Published Fri, Feb 12 2016 1:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వ్యక్తిపై అకారణంగా ఎస్ఐ దాడి
వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణోత్సవం
సీఎం జగన్తోనే బడుగుల అభ్యున్నతి
ముమ్మరంగా పోస్టల్ బ్యాలెట్
No Headline
నా మంచితనాన్ని.. చేతగానితనంగా తీసుకోవద్దు
టీడీపీ ప్రచారంలో యానిమేటర్
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement