మావోలకు షెల్టర్ జోన్ కాదు | Maoists in West Godavari | Sakshi
Sakshi News home page

మావోలకు షెల్టర్ జోన్ కాదు

Jan 21 2016 2:28 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం షెల్టర్ జోన్ కాదని ఎస్పీ భాస్కరభూషణ్ పేర్కొన్నారు. బుట్టాయగూడెం

బుట్టాయగూడెం : మావోయిస్టులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం షెల్టర్ జోన్ కాదని ఎస్పీ భాస్కరభూషణ్ పేర్కొన్నారు. బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ పశ్చిమ ఏజెన్సీలో ప్రత్యేక పోలీస్ బృందాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని చెప్పారు.  జిల్లాలో క్రైం రేటు బాగా తగ్గిందన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని, త్వరలో ప్రభుత్వం భర్తీ చేస్తుందని తెలిపారు. జిల్లాలో పోలీస్ క్వార్టర్లు అధ్వానంగా ఉన్నాయని నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. డీఎస్పీ జె.వెంకట్రావు, ఎస్‌ఐ ఎన్.పోతరాజు ఉన్నారు.
 
 విలీన మండలాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
 వేలేరుపాడు : మావోయిస్టుల కదలికలున్న విలీన మండలాల్లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ భాస్కర్‌భూషన్ ఆదేశించారు. బుధవారం వేలేరుపాడు, కుక్కునూరు పోలీసు స్టేషన్‌లను ఆయన తనిఖీ చేశారు.  ఈ రెండు మండలాలు జిల్లాలో విలీనమయ్యాక ఈ ప్రాంతంలో ఎస్పీ పర్యటించడం ఇదేమొదటిసారి. ఎస్పీ మాట్లాడుతూ  ఈ రెండు మండలాల్లో  పోలీసు సిబ్బంది నిత్యం గ్రామాల్లో  నిఘా ఉంచాలని సూచించారు. రెండు పోలీసు స్టేషన్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బందిని  పెంచుతామని చెప్పారు. అడిషనల్ ఎస్పీ పీబీ చంద్రఖేఖర్, డీఎస్పీ జె.వెంకట్రావు, వేలేరుపాడు, కుక్కునూరు ఎస్‌ఐలు రామచందర్‌రావు, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement