వరుసకు బావా మరదళ్లు.. కానీ ఒప్పుకోలేదు | lovers suicide attempt in krishna district | Sakshi
Sakshi News home page

వరుసకు బావా మరదళ్లు.. కానీ ఒప్పుకోలేదు

Jul 2 2017 11:52 AM | Updated on Nov 6 2018 8:08 PM

వరుసకు బావా మరదళ్లు.. కానీ ఒప్పుకోలేదు - Sakshi

వరుసకు బావా మరదళ్లు.. కానీ ఒప్పుకోలేదు

పెదఅవుట్ పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

ఏలూరు: కృష్ణా జిల్లా పెదఅవుట్ పల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం తెల్లవారు జామున ఇద్దరు ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కథనం ప్రకారం.. ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంకు చెందిన ముల్లంగి సత్యబాబు(20), మైలవరం మండలం చంద్రాలకు చెందిన పెనుమర్తి విజయలక్ష్మీ(19) ప్రేమించుకున్నారు. వీరు వరుసకు బావా మరదళ్లు. సోమవారం విజయలక్ష్మీకి పెళ్లి నిశ్చయ తాంబూలాల కార్యక్రమం జరగనున్నట్లు సత్య బాబు తెలుసుకున్నాడు.

ప్రేమించిన ఆమెను బైక్ పై ఎక్కించుకుని ఆగిరిపల్లికి తీసుకువచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి సమీపంలోని రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే సీఐ శివశంకర్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదస్థలంలో తాళిబొట్లు, వందరూపాయల నోటు లభించాయి. దీంతో వీరిద్దరికీ ఇటీవల వివాహం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement