కృష్ణాజిల్లా మచిలీపట్టణం మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్ణా: కృష్ణాజిల్లా మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మచిలీపట్నం మండలం పొట్లపాలెం గ్రామంలో పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం విడుదల చేసిన భూసేకరణ నోటిఫికేషన్ను వెంటనే నిలిపివేయాలని ఆందోళన చేశారు. మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కుర్చీలను తగలబెట్టి తమ నిరసనను తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.