అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లిలో ఓ వ్యక్తి.. భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు.
అనంతపురం (కనగానపల్లి) : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లిలో ఓ వ్యక్తి.. భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. కుర్లపల్లి గ్రామానికి చెందిన అక్కులప్ప తన భార్య మల్లీశ్వరమ్మ(35)పై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఆవేశానికి లోనైన అక్కులప్ప ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యను దారుణంగా నరికాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం అక్కులప్ప పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.