శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి | High Court Judge visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

Nov 26 2015 6:35 PM | Updated on Sep 3 2017 1:04 PM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న జస్టిస్ ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో ఆలయ అధికారులు జస్టిస్‌కు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట స్థానిక జడ్జి శేషాద్రి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement