విజయనగరం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదుల త్రిసభ్య బృందం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఆకస్మికంగా పర్యటించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితి, వాటికి రన్నింగ్ వాటర్, తాగునీటి సదుపాయాలపై సంబంధిత ప్రధానోపాధ్యాయులను అడగడమే కాకుండా స్వయంగా పరిశీలించింది. శనివారం ఉదయం జిల్లాకు చేరుకున్న బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్కుమార్ గుప్త నేతృత్వంలో న్యాయవాదులు టి.వి. రత్నం, జి. వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. ముందుగా డెంకాడ మండలం జొన్నాడ ఉన్నత పాఠశాలకు చేరుకుని పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మరుగుదొడ్లకు అవసరమైన నీటి సదుపాయం ఉందో లేదో చూశారు.
అలాగే తాగునీటి వనరులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటల రుచి, నాణ్యతను చూశారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పరిశీలన జరుగుతోందన్నారు. పరిశీలనలో సేకరించి న వివరాలతో నివేదికలను సుప్రీం కోర్టుకు అందజేస్తామని తెలిపారు. తాము తయారు చేసుకున్న రూట్ మ్యాప్ ఆధారంగా అక్కడ నుంచిపర్యటన కొనసాగించారు. డెంకాడ మండలంలోని చినఅమకాం, రాజుల తమ్మాపు రం, బొడ్డుపాలెం,పినతాడివాడ, ఊడికల పేట, జమ్ము తదితర పాఠశాలలను పరిశీ లించారు. అనంతరం జెడ్పీ అతిథి గృహానికి చేరుకున్న బృందాన్ని కలెక్టర్ నాయక్ మ ర్యాదపూర్వకంగా కలిశారు.
మధ్యాహ్నం పర్యటనలో విజయనగరం డివిజన్లోని గం ట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెం టాడ మండలాలతో పాటు పార్వతీపురం డివిజన్లోని బొబ్బిలి, రామభద్రపురం మండలాలకు చెందిన పాఠశాలల్లోని వసతులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 పాఠశాలలను పరిశీలించింది. విద్యాశాఖ సంయుక్త సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్నకుమార్, ఆర్వీఎం రాష్ట్ర ఈఈ సుధీర్బాబు, డీఈఓ జి.కృష్ణారావు, ఆర్వీఎం పీఓ శారద, ఉప విద్యాశాఖ అధికారులు నాగమణి, సత్యనారాయణ, డీపీఓ బి.మోహనరావు పర్యటనలో పాల్గొన్నారు
పాఠశాలల్లో సదుపాయాలపై సుప్రీం ఆరా
Published Sun, Aug 24 2014 1:44 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement