ఖర్చులకు కళ్లెం! | Free Primary Education Development | Sakshi
Sakshi News home page

ఖర్చులకు కళ్లెం!

Oct 23 2013 2:59 AM | Updated on Aug 20 2018 9:16 PM

ప్రాథమిక విద్యా పురోగతి పేర విచ్చలవిడిగా ఖర్చుచేయడం అలవాటుగా మారిన రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం)కు ఈ ఏడాది నిధులివ్వకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త పరీక్ష పెట్టింది.

పాలమూరు, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్యా పురోగతి పేర విచ్చలవిడిగా ఖర్చుచేయడం అలవాటుగా మారిన రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం)కు ఈ ఏడాది నిధులివ్వకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త పరీక్ష పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆర్‌వీఎం అధికారులు రూ.385.75 కోట్లకు ప్రతిపాదనలు పం పగా, అందులోరూ.140.02 కోట్లకు మాత్రమే కేంద్రం అనుమతి లభించింది. అయితే గ తంలో ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగం కాలేదన్న ఉద్దేశం తో ఈ ఏడాదికి కొత్తగా నిధులు విడుదల చేయకుండా, అందుబాటులో ఉన్న వాటినే సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. దీంతో అధికారులు మల్లగుల్లాలు పడు తూ.. ఖాతాలో ఉన్న నిధులను పొదుపుగా వాడేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు.
 
 ఆర్‌వీఎం కొత్త ప్రణాళిక
 ప్రస్తుతం ఆర్‌వీఎం ద్వారా భారీగా నిధు లు ఖర్చుచేసే నివాస, ప్రత్యేక శిక్షణ కేం ద్రాలకు(ఆర్‌ఎస్‌టీసీ)కోత పెట్టింది. ఈ కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల(ఎన్‌జీఓ) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయి తే వీటి నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది పలు ఆర్‌ఎస్‌టీసీ కేంద్రాలకు కోతపెట్టి, ఈ నిధులను విద్యాబోధకులపై ఖర్చు చేసేందుకు ఆర్‌వీఎం జిల్లా అధికారులు దృష్టిసారించారు. జిల్లాలో 47 ఆర్‌ఎస్‌టీసీలు కొనసాగుతుండగా మూడున్నర నెలల క్రితం వీటి కాలపరిమితి ముగిసిం ది.
 
 అయితే కొత్తగా రెన్యువల్ చేస్తే మళ్లీ ఈ కేంద్రాలు కొనసాగే అవకాశం ఉం టుంది. కొత్త వాటికి అనుమతిచ్చే అం శంలో ఆర్‌వీఎం ఆచితూచి వ్యవహరి స్తోంది. ఒక్కో ఆర్‌ఎస్‌టీసీ ద్వారా నెలకు సగటున రూ.60 వేల నుంచి రూ.85వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ  కేంద్రాలకు కోతపెట్టడంతో జిల్లా ఆర్‌వీఎంకు భా రీగా నిధులు మిగలనున్నాయి. కొత్త ఆర్‌ఎస్‌టీసీల నిర్వహణపైనా ఆర్‌వీఎం ప్ర త్యేక ప్రణాళిక తయారుచేస్తోంది. టీచర్ల ఖాళీలు అధికంగా ఉన్న గ్రామీణ మండలాల్లో అదనంగా 600 మంది విద్యా బోధకులను నియమించనున్నట్లు ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు.
 
 ఈ ఏడాదికి ప్రతిపాదనలు
 ఈ విద్యా సంవత్సరంలో కార్యాచరణ ప్రణాళిక అమలుకోసం రూ.385.75 కోట్లు అవసరమని జిల్లా ఆర్‌వీఎం అధికారులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. బడిబయటి చిన్నారులను బడిబాట పట్టిం చేందుకు, ప్రత్యేకశిక్షణ  కేంద్రాల నిర్వహణకు రూ.8.37 కోట్లు, పా ఠ్యపుస్తకాలకు రూ.5.6 కో ట్లు, విద్యార్థులకు యూ నిఫామ్ కోసం రూ.14.52 కోట్లు, టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కోసం రూ.22 లక్షలు, అన్ని సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు రూ.1.05 కోట్లు, విద్యావలంటీర్లు, కొత్త టీచర్ల వేతనాలకు రూ.121.93 కో ట్లు, శిక్షణలకు రూ.6.49 కో ట్లు, టీచర్స్‌గ్రాంట్ రూ. 67.56 లక్షలు,స్కూల్ గ్రాం ట్ రూ.2.56 కోట్లు, రీసెర్చ్, ఎవల్యూషన్‌పై పర్యవేక్ష ణ, పరిశీలన కోసం రూ.55. 52 లక్షలు, మెయింటనె న్స్ గ్రాంట్ రూ.2.97 కోట్లు, ఇంటర్‌వెన్షన్ సీడబ్ల్యూఎస్‌ఎన్‌కు  రూ.3.08 కోట్లు, కంప్యూటర్, టీఎల్‌ఈ, లైబ్రరీ బుక్స్, స్పోర్ట్స్ వస్తువులకు రూ.8.35 కోట్లు, ఫర్నీచర్ (బెంచీలకు) రూ.5.74 కోట్లు, ఎస్‌ఎంసీ/పీఆర్‌ఐ శిక్షణలకు రూ.3.97 కోట్లు, సివిల్ వర్క్స్ కోసం రూ.84.52 కోట్లు, ఎన్‌పీఈజీఈఎల్ పథకం అమలుకు రూ.3.20 కోట్లు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల నిర్వహణకు రూ.78.39 కోట్లు ప్రతిపాదించారు. ఇతర కార్యక్రమాల నిర్వహణకు రూ.33.78 కోట్లను ప్రణాళికలో పేర్కొన్నారు. కాగా, ఈ మొత్తంలో కోత విధిస్తూ రూ.140.02 కోట్లను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement