వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు | four injuries as volvo bus turns turtle in anathapur district | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా... నలుగురికి గాయాలు

Jun 27 2015 7:30 AM | Updated on Sep 3 2017 4:28 AM

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది.

అనంతపురం: అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో 18 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సు బెంగళూరు నుంచి అనంతపురం పట్టణానికి వెళుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను వేరే బస్సులో పంపించే ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement