ఏపీలో 348కి చేరిన కరోనా కేసులు

Coronavirus Positive Cases Rises To 348 In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకినవారి సంఖ్య 348కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో గుంటూరులో 8, అనంతపురంలో 7, ప్రకాశంలో 3, పశ్చిమ గోదావరి ఒక్క కేసు నమోదైనట్టుగా తెలిపింది. ఈ రోజు ముగ్గురు కరోనా బాధితులు డిశ్చార్జ్‌ కావడంతో..  ఏపీలో ఇప్పటివరకు డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 9కి చేరింది. 

కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణబాబు మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి రోజు రివ్యూ చేస్తున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 1000 ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు. పేద ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top