సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటివరకు రాజధాని డిజైన్లు కూడా ఖరారు కాకపోవడంతో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో అమ్మకాలు లేకపోవడంతో పాటు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడంలేదు. దీంతో అమరావతి పరిధిలో రూ.10,000 కోట్ల విలువైన 3 కోట్లకు పైగా చదరపు అడుగుల నిర్మాణాల పరిస్థితి గందరగోళంగా తయారైంది.
రాజధాని నిర్మాణం మొదలు కాకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడంలేదని, వచ్చే ఎన్నికల తర్వాత కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో వాయిదా వేస్తున్నారని క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్రెడ్డి వివరించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. విభజన తర్వాత ఎన్నారైలతో సహా చాలామంది సొంత ప్రాంతంలో ఇళ్లు, స్థలాలు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్లు శేఖర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 20,000 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉండగా ఈ మధ్యనే కొత్తగా 6,000 ఫ్లాట్ల నిర్మాణ పనులు మొదలు పెట్టినట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు.
పెరుగుతున్న ధరలు
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇప్పుడు పెరుగుతున్న ముడి సరుకుల ధరలు మరింత కలవరపరుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో పాటు ఇసుక లభ్యత తగ్గడం పరిశ్రమను తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోందని క్రెడాయ్ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు శివారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. టన్ను స్టీల్ ధర రూ.35,000 నుంచి 50,000కు చేరిందన్నారు. సిమెంట్ ధరలు, కూలీ రేట్లు కూడా పెరగడంతో పాటు తగినంత ఇసుక సరఫరా లేకపోవడంతో అడుగుకు రూ.150 – రూ.200 వరకు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాజధాని ఆలస్యంతో రియల్టీకి దెబ్బ!
Published Sun, Jan 7 2018 10:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement