చింటూపై కేసు 18కి వాయిదా | Chintu case postponed to the 18 | Sakshi
Sakshi News home page

చింటూపై కేసు 18కి వాయిదా

Mar 10 2016 1:03 AM | Updated on Aug 13 2018 3:10 PM

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూపై నమోదైన మారణాయుధాల కేసు...

చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూపై నమోదైన మారణాయుధాల కేసు, మోసం చేసిన కేసుల విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

చింటూ నివాసంలో మారణాయుధాలు ఉన్నాయని, మహిళల్ని మోసం చేసి బంగారు ఆభరణాలు కాజేసిన ఓ కేసులో మహిళల్ని బెదిరించాడని చిత్తూరు టూటౌన్ పోలీసులు చింటూపై గతంలో కేసులు నమోదు చేశారు. కేసుల విచారణలో భాగంగా చింటూను బుధవారం కడప జైలు నుంచి చిత్తూరు కోర్టు ఎదుట హాజరు పరచారు. తదుపరి విచారణ వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement