చికిత్స పొందుతూ చర్లపల్లి ఖైదీ మృతి | Cherlapally Prisoner dies in Gandhi hospital | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ చర్లపల్లి ఖైదీ మృతి

May 21 2015 6:57 PM | Updated on Sep 28 2018 3:39 PM

సెల్‌ఫోన్ దొంగతనం కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

హైదరాబాద్ :  సెల్‌ఫోన్ దొంగతనం కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్(35)  అనే వ్యక్తి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో గతవారం సెల్‌ఫోన్ చోరీ కింద పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కాగా.. గురువారం అతని ఆరోగ్యం బాలేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement