శ్రీవారి సేవలో కేంద్ర ఆర్థిక మంత్రి | Central Minister Nirmala Sitharaman Visits Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో కేంద్ర ఆర్థిక మంత్రి

Aug 18 2019 12:02 PM | Updated on Aug 18 2019 12:11 PM

Central Minister Nirmala Sitharaman Visits Tirumala - Sakshi

తిరుమల/రేణిగుంట (చిత్తూరు జిల్లా): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం సాయంత్రం శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఆమెకు టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు. పుష్కరిణిలో నీటిని ప్రోక్షణ చేసుకున్నారు. శ్రీవరాహస్వామి వారిని దర్శించుకుని పుష్కరిణి హారతి అందుకున్నారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా,కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకి ఆమె శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement