బిల్లును అడ్డుకున్నది ఆంధ్ర పార్టీలే: హరీష్ | Andhra Parties Stop Telangana bill in Assembly, says Harish Rao | Sakshi
Sakshi News home page

బిల్లును అడ్డుకున్నది ఆంధ్ర పార్టీలే: హరీష్

Dec 23 2013 3:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

బిల్లును అడ్డుకున్నది ఆంధ్ర పార్టీలే: హరీష్ - Sakshi

బిల్లును అడ్డుకున్నది ఆంధ్ర పార్టీలే: హరీష్

తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.


 హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి  గోల్నాకలో కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ, శాసనమండలిలలో ఆంధ్ర నాయకులే అధినాయకులుగా ఉన్నందున బిల్లుపై చర్చజరగకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. కాగా, టీఆర్‌ఎస్‌లో చేరినవారిలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన మోహన్‌రెడ్డి, కేకే శ్రీనివాస్, లింగం, వారి అనుచరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement