బస్సును ఢీకొట్టిన లారీ.. 35 మందికి గాయాలు | A lorry hits rtc bus, 35 passengers injured | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొట్టిన లారీ.. 35 మందికి గాయాలు

May 22 2017 8:31 AM | Updated on Apr 3 2019 7:53 PM

బస్సు, లారీ ఢీ..35 మందికి గాయాలు,నలుగురి పరిస్థితి..

నెల్లూరు: ప్రయాణికులను ఎక్కించుకునేందుకు రోడ్డు పక్కన ఆగిన ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో.. బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట-అగ్రాహారం రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది.
 
తిరుపతి నుంచి కావలి వెళ్తున్న కావలి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న సమయంలో అతి వేగంతో వచ్చిన లారీ బస్సు వెనుక భాగంలో ఢీకొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. లారీ డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement