ఆటో బోల్తా: నలుగురికి గాయాలు | 4 injured in auto accident at krishna district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: నలుగురికి గాయాలు

Feb 25 2016 8:45 AM | Updated on Mar 9 2019 4:28 PM

కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలో ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి.

మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలో ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలు అయ్యాయి. గురువారం ఉదయం గుంటూరు జిల్లా చింతమోటు నుంచి చల్లపల్లి వైపు వెళుతున్న ఆటో మోపిదేవి సమీపంలోని ఎస్‌ఎన్‌ఎస్ స్కూల్ దగ్గరకు రాగానే... ముందు వెళుతున్న వాహనాలను అధిగమించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వెంటనే స్థానికులు ఆటోను పైకి లేపారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా చికిత్స కోసం రేపల్లెకు తరలించారు. ఆటోలో మొత్తం 15 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement