ఏపీలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.14 శాతం | 38 Victims discharged after Recovery from Covid-19 | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇన్ఫెక్షన్‌ రేటు 1.14 శాతం

May 11 2020 5:11 AM | Updated on May 11 2020 5:11 AM

38 Victims discharged after Recovery from Covid-19 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్‌ రేటు ఆదివారం 1.14 శాతంగా నమోదైంది. ఆదివారం కోవిడ్‌ నుంచి కోలుకుని 38 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 925కు చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసులు 1010 ఉన్నాయి.  

► కోవిడ్‌ బారి నుంచి కోలుకుని కర్నూలు జిల్లా నుంచి 21 మంది, గుంటూరు జిల్లా నుంచి 8, కృష్ణా జిల్లా 3, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున, అనంతపురం, నెల్లూరు నుంచి ఒక్కరు చొప్పున డిశ్చార్జ్‌ అయ్యారు. 
► శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 8,666 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 50 మందికి కరోనా పాజిటివ్‌ నమోదైనట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.  
► కర్నూలు జిల్లాలో మరో మరణం సంభవించడంతో మొత్తం మరణాలు 45కి చేరాయి. ఇప్పటి దాకా మొత్తం 1,73,735 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,980కి చేరింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement