అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీలను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీలను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా శ్రీకాకుళం నుంచి విశాఖకు ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ ఇలియాస్ అహ్మద్ తెలిపారు. వాటిని ఆయా ప్రాంతాలైన పీఎంపాలెం, భీమిలి, పరవాడ పోలీసులకు అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.