రంపచోడవరంలో విషాదం | 3 members suicide attempt in east godavari district | Sakshi
Sakshi News home page

రంపచోడవరంలో విషాదం

Dec 24 2015 2:17 PM | Updated on Sep 3 2017 2:31 PM

ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వ్యాపార నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

రంపచోడవరం: ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వ్యాపార నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన శంకర్ (50) మాడిమిల్లి రోడ్డులో రెండు వస్త్ర దుకాణాలను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపార నిమిత్తం అప్పులు తీసుకున్నాడు.
 
అయితే అప్పులు పెరిగిపోవడంతో మనస్థాపానికి గురైన శంకర్ భార్య లక్ష్మీ(45), కొడుకు వీరబాబు(25)లతో సహా పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు వారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వీరబాబు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement