breaking news
-
ప్రొద్దుటూరులో ప్రాణం తీసిన రూ.150 అప్పు
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రొద్దుటూరు గ్రామంలో దారుణం జరిగింది. రూ.150 రూపాయల అప్పు ప్రాణాలు తీసింది. వెంకటస్వామి వద్ద భుజంగరావు అనే వ్యక్తి 150 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.భుజంగరావును వెంకటస్వామి ఛాతిపై గట్టిగా కొట్టాడు. దీంతో ఒక్కసారిగా భుజంగరావు కుప్పకూలిపోయారు. భుజంగరావును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి
సాక్షి, అమరావతి/పుంగనూరు: చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధతకు రాష్ట్రంలో మరో చిన్నారి బలైపోయింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలికను కొందరు 4 రోజుల క్రితం అపహరించి హత్య చేశారు. రెండు నెలల క్రితం నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కొందరు దుండగులు ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. బాపట్ల జిల్లాలో ఓ యువతిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. బాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా యువతులు, బాలికలపై అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది. తొలి నెల రోజుల్లోనే 20 మంది బాలికలు, యువతులపై అత్యాచారాలు జరిగాయి. వారిలో నలుగురిని హత్య కూడా చేశారు. వేధింపులు తట్టుకోలేక 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆధునిక టెక్నాలజీకి తానే ప్రతినిధిని అనేలా ప్రతి చోటా చంద్రబాబు ఆయన గురించి చెప్పుకొంటూ ఉంటారు. సాంకేతికతతో పోలీసు వ్యవస్థ పటిష్టం చేస్తామని కూడా అంటుంటారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా, ఒక్క ఘటనలో కూడా నేరస్తులను కనీసం గుర్తించలేకపోవడం గమనార్హం. ముస్లిం చిన్నారిని చిదిమేసిందెవరు? అంజుమ్ కిడ్నాప్నకు గురైనా పాప ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆదివారం రాత్రి బాలిక అదృశ్యమైంది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం.. సోమవారం.. మంగళవారం మూడు రోజులు గడిచినా పోలీసులు అంజుమ్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. రాయచోటి నుంచి వచ్చిన పోలీసు జాగిలాలు బాలిక ఇంటి చెంగలాపురం రోడ్డులోని ముళ్ల పొదల వద్దకు వెళ్లి ఆగిపోయాయి. చివరకు బుధవారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో అంజూమ్ మృతదేహాన్ని గుర్తించారు. బాలికది హత్యగా పోలీసులు నిర్ధారించారు. మృతదేహం లభ్యమై ఒక రోజు దాటిపోయినా ఇప్పటికీ హంతకులెవరో కూడా పోలీసులు గుర్తించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అజ్మతుల్లా ఇంటి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్యాంకు 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్లే దారిని సోలార్ ప్రాజెక్టు నిర్వాహకులు సగం వరకు మూసివేశారు. ట్యాంకు కింది భాగంలో వాచ్మేన్ ఉంటాడు. అందువల్ల కొత్తవారు ఎవరికీ అక్కడికి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. ఎన్ఎస్ పేట ప్రాంతం వారిలో కొందరికి మాత్రమే ట్యాంకుకు వెళ్లే మార్గాలు తెలిసే అవకాశం ఉందని, ఆ ప్రాంతం వారు హత్యకు సహకరించి ఉంటారని పోలీసులు అనుమానిçస్తున్నారు. బాలిక శరీరంపై గాయాలున్నట్లు, రక్తస్రావం అయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఆమె శరీరంపై గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనను కూడా పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కడుపు కోత ఏ కుటుంబానికీ రాకూడదు: షమియ, అజ్మతుల్లా పక్కంటిలో ఆడుకుని వస్తానని చెప్పి వెళ్లిన చిన్నారి మరణంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. తాము ఎవరికి కీడు చేయలేదని, అయినా విధి తమ కుటుంబంపై కన్నెర్ర చేసిందని బాలిక తల్లి షమియ, తండ్రి అజ్మతుల్లా కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ఎవరూ విరోధులు లేరని, ఎందుకు చంపేశారో తెలియదని చెప్పారు. తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తమ బిడ్డను వెతికేందుకు పట్టణ ప్రజలు కులమతాలకతీతంగా ఐదు రోజులుగా కష్టపడ్డారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంజుమ్ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాష్ట్రంలో బాలికలు, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోవడంపట్ల ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అసమర్థతపై ధ్వజమెత్తుతున్నాయి. ముస్లిం బాలిక అంజుమ్ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ ముస్లిం సంఘాలతోపాటు ప్రజా సంఘాలు బుధవారం, గురువారం ఆందోళన చేశాయి. హంతకులను వెంటనే పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని, ఉరితీయాలని డిమాండ్ చేశాయి. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు గురువారం భారీ సంఖ్యలో పుంగనూరులో సమావేశమయ్యారు. బాలికను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ అంజూమ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ హిందూ జాగరణ సమితి సభ్యులు పుంగనూరులో గురువారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పుంగనూరు మున్సిపాలిటీ అర్బన్ సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీ చేశాయి. అంబేడ్కర్ దళిత రాష్ట్ర సేవా సమితి ధర్నా చేసింది. బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంపై వైఎస్సార్సీపీ, సోషల్ డెమొక్రటిక్ పార్టీలతోపాటు పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. అంజూమ్ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పాయి. హంతకులను పట్టుకొనేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రజా సంఘాలు తేల్చిచెప్పాయి.వాసంతి ఉదంతం నుంచి గుణపాఠం నేర్వని బాబు ప్రభుత్వం బాలికలు, మహిళలకు భద్రత కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అసమర్థతను నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఉదంతం చాటిచెప్పింది. ముచ్చుమర్రికి చెందిన వాసంతి అనే అయిదో తరగతి విద్యార్థినిని జూలై 7న కొందరు అపహరించుకుపోయారు. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆందోళనతో ఒక రోజు తరువాత కేసు నమోదు చేసి, తూతూ మంత్రంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాసంతిపై అత్యాచారం చేసి హత్య చేసి కృష్ణా నదిలో పడేసినట్టు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటి దారుణ ఘటన కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని కదిలించలేపోయింది. కనీసం ఆ బాలిక మృతదేహాన్ని వెతికి ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలన్న ధ్యాస కూడా చంద్రబాబు సర్కారుకు లేకుండాపోయింది. వాసంతి విషాదాంతం నుంచి కూడా ప్రభుత్వం గుణపాఠం నేర్వలేదు. ఆ ని్రష్కియాపరత్వానికే పుంగనూరులో ముస్లిం బాలిక బలైపోయింది. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
కాకినాడలో హృదయ విదారకం.. ఆడపిల్ల పుట్టిందని గోడకేసి..
సాక్షి, కాకినాడ: ఆడపిల్లగా జన్మించడమే ఆ శిశువుపాలిట మరణ శాసనమైంది. ఆడిపిల్ల భారం మోయలేనంటూ అమ్మేస్తానని భార్యతో చెప్పడంతో ఆమె వద్దన్న పాపానికి రక్తం పంచిన కన్న తండ్రే ఆ శిశువును కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన చెక్కా భవానీ కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కేతా శివమణి అనే వ్యక్తితో సహాజీవనం చేస్తోంది. వీరికి కొన్నేళ్ల క్రితం బాబు జన్మించాడు. అనంతరం, ఆ బాలుడిని శివమణి మరో వ్యక్తి అమ్మేశాడు. ఇక, 34 రోజుల క్రితమే వీరికి మరో ఆడ శిశువు జన్మించింది. అప్పటి నుంచి శివమణి ఆడపిల్ల పుట్టిందని అసంతృప్తితో ఉన్నాడు. ఆడపిల్ల తనకు భారం అంటూ భవానీతో నిత్యం గొడవ పడుతూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే బుధవారం రాత్రి భవానీ వద్దకు వచ్చి మంచి బేరం కుదిరింది అని బిడ్డను అమ్మేస్తానని చెప్పాడు. దీంతో, కంగుతిన్న భవానీ.. శివమణి తీరును తప్పుబట్టింది. బిడ్డను అమ్మేందుకు భవానీ అంగీకరించను అంటూ తెగేసి చెప్పింది.ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం జరుగుతుండగానే పక్కనే నిద్రపోతున్న శిశువును తన చేతిలోకి తీసుకున్న శివమణి.. బిడ్డ గొంతు నులిమి గోడకు కొట్టాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న శిశువును భవానీ స్థానికుల సాయంతో కాకినాడ జీజీహెచ్కు తీసుకెళ్లింది. కొన ప్రాణాలతో ఆసుపత్రిలో చేరిన కాసేపటికే శిశువు మృతిచెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కాకినాడ వన్టౌన్ పోలీసులు సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు శివమణి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: జత్వానీ ఫోన్, ల్యాప్టాప్ను ఎఫ్ఎస్ఎల్కు పంపండి -
‘కానరాని లోకాలకు చిట్టితల్లి’
చిత్తూరు, సాక్షి: పోలీసులకు సవాల్గా మారిన పుంగనూరు చిన్నారి అదృశ్యం కేసు.. విషాదాంతం అయ్యింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక అస్పియా ఇవాళ శవంగా కనిపించింది. తన చిట్టితల్లి సురక్షితంగానే ఉండి ఉంటుందని, ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి.. చివరకు కడుపు కోతే మిగిలింది. సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటోంది ఆస్పియా. కరెంట్ పోయి వచ్చాక చిన్నారి కనిపించలేదు. కంగారుపడిన తల్లి.. తండ్రి అజ్మతుల్లాకు ఫోన్ చేసి సమాచారం అందించింది. స్థానికంగా వెతికినా ఆమె కనిపించలేదు. దీంతో అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. మూడు రోజులుగా బాలిక ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఏకంగా 11 ప్రత్యేక బృందాలతో, డాగ్ స్క్వాడ్తో పుంగనూరు చుట్టుపక్కల జల్లెడ పట్టారు. అయితే ఇవాళ (బుధవారం) ఉదయం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఓ శవం తేలుతుందని పోలీసులకు సమాచారం అందింది.హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదొక చిన్నారి మృతదేహంగా తేల్చారు. అస్పియా తండ్రిని పిలిపించి.. ఆ చిన్నారిదేనని నిర్ధారణకు వచ్చారు. తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు.. బిడ్డ మృతితో రోదించారు. చిన్నారి విగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణమంతా శోకసంద్రంలో మునిగింది. అయితే బాలిక అక్కడికి ఎలా వెళ్లింది? ప్రమాదవశాత్తు చెరువులో పడిందా..? లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి పడేసారా?.. ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
17 మంది మావోయిస్ట్ మిలీషియా సభ్యుల లొంగుబాటు
పాడేరు: పెదబయలు ఏరియా కమిటీకి చెందిన నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది మిలీíÙయా సభ్యులు మంగళవారం పాడేరులో జిల్లా ఎస్పీ అమిత్బర్ధర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆ వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. పలు నేరాలకు పాల్పడిన మిలీషియా సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు నిర్ణయించుకున్నట్టు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వపరంగా రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లొంగిపోయిన వారిపై ఎలాంటి కేసులుండవని స్పష్టం చేశారు. పాడేరు ఏఎస్పీ ధీరజ్, సీఆరీ్పఎఫ్ 198 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ కె.ధారియన్ రాజు తదితరులున్నారు. -
851 కిలోల గంజాయి పట్టివేత
కొయ్యూరు : రూ.20 లక్షలకు పైగా విలువ చేసే 851 కిలోల గంజాయిని సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితోపాటు ఒక బైక్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బూదరాళ్ల రహదారి నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు గంజాయితో రెండుకార్లు వస్తున్నాయన్న ముందస్తు సమాచారంతో చీడిపాలెం జంక్షన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.అయితే, కార్లు రావడానికి ముందు పైలట్గా బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూడగానే పారిపోయారు. అదే సమయంలో ఒక కారులో ఉన్న ముగ్గురు, మరో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు. డ్రైవర్లు సైతం పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు రెండు కార్ల డ్రైవర్లను పట్టుకున్నారు. వాటిని వెనక్కి తీసుకెళ్లే క్రమంలో స్మగ్లర్లు కారును వేగంగా డ్రైవ్ చేస్తుండగా దొడ్డవరం వెళ్లే మలుపు వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారును వదిలి వారు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న కారు నుంచి 185 గంజాయి ప్యాకెట్లు, మరో కారు నుంచి 94 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
Vizag: అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విదేశీయులే లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమ కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న సంస్థలపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖ సాగర్ నగర్ ప్రాంతంలో పలు సంస్థల్లో తనిఖీలు చేశారు. మురళీనగర్లో ఉంటున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. భారత్లో పలు రాష్ట్రాల నుంచి రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డుల పేరుతో అమెరికా, ఇతర దేశాలకు చెందిన వారిని ఆకర్షిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఎఫ్బీఐ ఇచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ఆయా సంస్థలపై నిఘా పెట్టారు.తొలుత థానేలోని కాల్ సెంటర్ నుంచి 140 మందిని రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ అక్రమ ఆపరేషన్కు సంబంధించిన సర్వర్ను అహ్మదాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడ కొంత మందిని అరెస్టు చేయగా.. హైరదరాబాద్, కోల్కతా, విశాఖలలోనూ ఈ సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు.దీంతో నగరంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. సాగర్నగర్ ప్రాంతంలోని దేవీ ప్యారౖడెజ్లో నివాసం ఏర్పరచుకున్న అక్షయ్ పాత్వాల్, ధీరజ్ జోషి, హిమాన్షు శర్మ, పార్థ్బాలి, ప్రితేష్ నవీన్ చంద్రపటేల్లను మురళీనగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. -
విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో విద్యార్థిని సాయిశ్రేయ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సాయిశ్రేయ మృతికి కారణాలు తెలియజేయాలని రెండు రోజులుగా కోరుతున్నా వీసీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మంజుల ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గేటు ఎదుట బైఠాయించారు. విట్ వద్ద గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ వచ్చి మంజులను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు.దీంతో యూనివర్సిటీ యాజమాన్యంతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులను లోపలికి తీసుకువెళ్లి వీసీ, ఇతర అధికారులను కలిశారు. ఈ నెల 17న తన కుమార్తె చనిపోయిందని, దానికి కారణాలు చెప్పాలని కోరుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం తమను ఇబ్బంది పెట్టిన తీరును వివరిస్తూ మంజుల కన్నీటిపర్యమంతమయ్యారు. ‘విద్యార్థిని చనిపోతే మాకేం సంబంధం లేదని వదిలేస్తారా...? ఆ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. లేకపోతే నేను సహించను..’ అని విట్ వీసీ, సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
చిత్తూరు మొగలిఘాట్ రోడ్లో మరో ఘోరం
చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్తో పాటు, మరో లారీ డ్రైవర్ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్.. ☠️ స్పాట్ ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్లో ఇరుక్కుని మృతి -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు..సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే అతనిని బహిరంగంగా దూషించడమే కాక బుధవారం చిట్టేల వెళ్లి దాడికి యత్నించడంతో ఆమె కలతచెంది నిద్రమాత్రలు మింగారు. ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హుటాహుటిన విజయవాడ తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్నారు.ఎమ్మెల్యే వేధింపులతోనే ఆత్మహత్యాయత్నంఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి యత్నిస్తుండడంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరువూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించడమేకాక చిట్టేల వాగు నుంచి ఇసుక తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరోపిస్తూ అంతమొందిస్తానని బెదిరించారని చెప్పారు. తిరువూరు మెయిన్రోడ్డులో బహిరంగంగా తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపైకి ఉసిగొల్పుతున్నాడని సర్పంచ్ వివరించారు. చిట్టేలలో బుధవారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దురుసు ప్రవర్తన, దౌర్జన్యంతో ఆందోళనకు గురైన తన భార్య కవిత నిద్రమాత్రలు మింగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తుల ఆందోళన..ఈ ఘటన నేపథ్యంలో చిట్టేల గ్రామస్తులు బుధవారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి çకూడా పరామర్శించిఅండగా ఉంటామని చెప్పారు. -
‘కిమ్స్’ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదైంది. రెండో భార్యకు పుట్టిన సంతానం మెదటి భార్య, సమీప బంధువులకు జన్మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నది ఆరోపణ. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్టులు కూడా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమ, ప్రసాద్లనూ నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలో జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్కు బదిలీ చేశారు. విశాఖపటా్ననికి చెందిన కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆస్పత్రిలో పని చేస్తుండగా కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్గా ఉన్న కృష్ణయ్యతో పరిచయమైంది. తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటూ కృష్ణవేణిని నమ్మించిన కృష్ణయ్య 2004 ఫిబ్రవరిలో ఆమెను వివాహం చేసుకున్నారు. వీళ్లు బంజారాహిల్స్లో కాపురం పెట్టారు. కొన్నిరోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లడంతోపాటు బంధువులకూ భార్యగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికారు. వీరికి 2004లో కుమారుడు అర్జున్ జన్మించాడు. కృష్ణయ్య, కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నారు. 2006లో అనారోగ్య కారణాలు చెప్పిన కృష్ణయ్య తన కుమారుడిని తనతో తీసుకెళ్లారు. తర్వాత ఇద్దరు కుమార్తెలు... 2006లో కృష్ణవేణి కుమార్తె కృష్ణ వైష్ణవికి జన్మనిచ్చింది. రెండేళ్ల తర్వాత వివిధ కారణాలు చెప్పిన కృష్ణయ్య వైష్ణవినీ తీసుకెళ్లిపోయారు. వీరికి 2011లో రెండో కుమార్తె శ్రీనిక పుట్టింది. ఆ తర్వాత నుంచి కృష్ణయ్య... కృష్ణవేణి వద్దకు రావడం మానేశారు. కుమారుడు, మొదటి కుమార్తె వివరాలను కూడా ఆమెకు తెలియనీయలేదు. కృష్ణవేణి ఎన్నిసార్లు కోరినా అర్జున్, వైష్ణవిలను చూపించడానికి సుముఖత చూపలేదు. ప్రతి నెలా కృష్ణవేణికి నిర్ణీత మొత్తం చెల్లిస్తూ వచ్చారు. 2016లో ఆమెను ఖాజాగూడలో ఉన్న తన విల్లాలోకి మార్చారు. తనతోపాటు తన పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని కృష్ణవేణి కోరారు. దీంతో ఆయన వీళ్లు నివసిస్తున్న విల్లాను మాత్రం శ్రీనిక పేరుతో బదిలీ చేశారు. ఆ తర్వాత నుంచి కృష్ణవేణిని పట్టించుకోవడం మానేశారు. తన కుమారుడిని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసిన కృష్ణవేణి ఎట్టకేలకు 2021లో కలవగలిగారు. ఆమె తన తల్లి అని తెలుసుకున్న అర్జున్ షాక్ అవడంతోపాటు తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించినట్లు చెప్పాడు. ఈమె అర్జున్ను కలుస్తున్న విషయం తెలుసుకున్న కృష్ణయ్య మానుకోవాలని బెదిరించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. 2022లో విదేశాలకు వెళ్లిన అర్జున్ ఇక్కడకు వచ్చినప్పుడు తల్లిని కలిసేవారు. వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. ఆమె కృష్ణయ్య సమీప బంధువులైన హేమ, ప్రసాద్ల కుమార్తెగా పెరుగుతున్నట్లు చెప్పాడు. కృష్ణయ్య తదితరులు అర్జున్, వైష్ణవిలకు సంబంధించి కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి, ధ్రువీకరణలు పొందినట్లు కృష్ణవేణి గుర్తించారు. వీటి ఆధారంగానే జీహెచ్ఎంసీ నుంచి బర్త్ సర్టిఫికెట్లు, రీజనల్ పాస్పోర్టు కార్యాలయం నుంచి పాస్పోర్టులు పొందినట్లు తెలుసుకున్నారు. ఈ ఆధారాలన్నీ పొందుపరుస్తూ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టేయాలంటూ కృష్ణయ్య కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. తొలుత చీటింగ్, ఆపై అదనపు ఆధారాలతో ఫోర్జరీ కేసుగా మారింది. సీసీఎస్ పోలీసులు కేసును రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
తిరుపతి: ఉన్నతాధికారుల వేధింపులు.. సీఐ మిస్సింగ్!
తిరుపతి, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. ఉద్యోగులకు వేధింపులు అధికమయ్యాయి. ఈ నేపథ్యంతోనే.. జిల్లాలో ఓ సీఐ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నిరోజులుగా ఉన్నతాధికారుల నుంచి ఆయన వేధింపులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి రాలేదని వాళ్లు అంటున్నారు. తన భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని, ఆయనకు ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని మహేశ్వర్రెడ్డి భార్య అంటోంది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తక ముందే.. ఆయన ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. -
మానవత్వమా.. కళ్లు మూసుకో!
నూజివీడు: టీడీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార జులుంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు సోమవారం మద్యం తాగి అదే గ్రామ టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో సురేష్.. మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు పోలవరపు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కారుమంచి కిరణ్లతో కలిసి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా నాగరాజును తాళ్లతో బంధించి.. తీవ్రంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకెళుతూ కారులో వేసుకుని రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే నాగరాజును తాళ్లతో నిర్బంధించి ఈడ్చూకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాపశివకిషోర్ దృష్టికెళ్లింది. అమానవీయంగా ప్రవర్తించిన నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్బాబులు నలుగురినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. -
లైంగిక దాడి కేసులో బతికున్నంతకాలం జైలు
ఏలూరు (టూటౌన్): కుమార్తె వరుస అవుతున్న ఇద్దరు బాలికలపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రికి బతికున్నంతకాలం యావజ్జీవ కా రాగార శిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద సోమవారం తీర్పు చెప్పారు. నిందితుడికి సహకరించిన బాలికల తల్లికి కూడా బతికున్నంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష వి ధించారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన పుట్ట విజయలక్ష్మి ఫణిరూప (38)కు ఇద్దరు కుమార్తెలున్నారు.విజయలక్ష్మి ఫణిరూప అదే గ్రామానికి చెందిన పుట్ట సతీష్ పవన్కుమా ర్ (42)ను రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో విజయలక్ష్మి ఫణిరూప ఇద్దరు కుమార్తెలపై సతీష్ పవన్కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు ఆమె కూడా సహకరించింది. ఇద్దరు బాధితుల్లో ఒక బాలిక 2023 జూలై 12న ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏలూరు మహిళా పోలీస్స్టేషన్ సీఐ ఇంద్ర శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. నిందితులు పుట్ట సతీష్ పవన్కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపను జూలై 14న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.విచారణలో పుట్ట సతీష్ పవన్కుమార్, పుట్ట విజయలక్ష్మి ఫణిరూపలపై నేరం రుజువు కావడంతో వారు బతికున్నంతకాలం జీవిత ఖైదు శిక్షతోపాటు రూ.18 వేలు జరిమానా విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడికి సహకరించిన షేక్ సత్తార్, బీఎస్కే నాగూర్ హుస్సేన్ వలీ, దూబచర్ల వీణకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
దంపతుల్ని చిదిమేసిన ఐషర్
అనంతపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలైన ఘటన నగర శివారు నేషనల్ పార్కు సమీపంలో జరిగింది. వివరాలు.. గుత్తి మండలం అబ్బేదొడ్డికి చెందిన కమతం హనుమంత రెడ్డి (72), కమతం రంగమ్మ (68) దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, కాంతమ్మ, కృష్ణకుమారి, ఒక కుమారుడు నాగేశ్వర రెడ్డి సంతానం. అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. నాగేశ్వర రెడ్డి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అనంతపురంలోని చిన్మయనగర్లో నివాసముండే కుమార్తెలను చూసేందుకు ప్రతి వారం హనుమంత రెడ్డి, రంగమ్మ వచ్చి వెళ్లేవారు. ఈ క్రమంలోనే సోమవారం వచ్చి తిరిగి స్వగ్రామం బయలుదేరారు. నేషనల్ పార్కు వద్ద వెళ్తున్న సమయంలో ఓ ఐషర్ వాహనం అదుపుతప్పి బైకుపై పడిపోయింది. తీవ్ర గాయాలైన దంపతులిద్దరూ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. ప్రమాద ధాటికి హనుమంతు రెడ్డి తల తెగిపోయింది. కక్కలపల్లి మండీలో టమాట బాక్సులు లోడు చేసుకున్న ఐషర్ డ్రైవర్ ముంబైకు వెళ్తున్నట్లు తెలిసింది. నేషనల్ పార్కు సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద వేగం అదుపు కాకపోవడంతో బోల్తా కొట్టి పక్కనే హనుమంత రెడ్డి, రంగమ్మలు వెళ్తున్న బైకుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మృతుల కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. -
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహిళలు అని కూడా చూడకుండా పచ్చ మంద కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా టీడీపీ కార్యకర్తలు మహిళలపై దాడి చేసిన వీడియోను షేర్ చేసింది. ఈ సందర్బంగా.. రాష్ట్రంలో టీడీపీ గూండాలు బరితెగించారు. మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు. వీరి దాడిలో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, పాలనను గాలికి వదిలేసి మహిళలపై దాడులు జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. రాష్ట్రంలో బరితెగిస్తున్న @JaiTDP గూండాలుమార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో వైయస్ఆర్ సీపీ మహిళా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన టీడీపీ గూండాలు దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళలురాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, పాలనను… pic.twitter.com/2c4Q6poQf9— YSR Congress Party (@YSRCParty) September 22, 2024 ఇది కూడా చదవండి: చంద్రబాబు మార్కు ‘కుట్ర’ తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు? -
బీటెక్ రవి దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతీ హలు సమీపంలో ఉన్న రాజగోపాల్రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి దాష్టీకాన్ని ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనే కారణంతో ఏకంగా తెలుగు తమ్ముళ్లను ఇంటికి పంపి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. పులివెందుల పట్టణం మారుతీ హాల్ సమీపంలో రాజగోపాల్రెడ్డి దంపతులు దుస్తుల షాపు నడుపుతున్నారు. పట్టణంలోని ప్రయివేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధు భార్య లావణ్య దుస్తుల షాపునకు వస్తూ వీరికి పరిచయమైంది. హైదరాబాద్లో బ్యూటీషియన్ కోర్సు చేస్తున్నానని కొంత, రియల్ ఎస్టేట్ కోసమని మరికొంత డబ్బును తీసుకుంది. ఏడాదిలో సుమారు రూ.32 లక్షలు తీసుకుంది. తర్వాత లావణ్యను డబ్బులు అడగడంతో నాలుగు నెలల కిందట రూ.10 లక్షల బ్యాంకు చెక్కులు ఇచ్చింది. కాగా, చెక్ బౌన్స్ అయిందని కోర్టులో రాజగోపాల్రెడ్డి, శ్రావణిలు కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి చెంతకు చేరింది. వారు ఫోన్ చేయడంతో రాజగోపాల్రెడ్డి లిఫ్ట్ చేయలేదని తెలుగు తమ్ముళ్లు వాహనాలు వేసుకుని రాజగోపాల్రెడ్డి ఇంటికి వెళ్లి.. మా వాళ్లపైనే కేసు వేస్తావా అంటూ వారిపై దాడి చేశారు. ఆరుగురు టీడీపీ కార్యకర్తలు రాజగోపాల్రెడ్డిని కారులోనే కొట్టుకుంటూ టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న బీటెక్ రవి నేతృత్వంలో మరింతగా రెచ్చిపోయారు.రాజగోపాల్రెడ్డి సతీమణి శ్రావణి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పోలీసులు టీడీపీ నేతలకు ఫోన్ చేశారు. దీంతోటీడీపీ నేతలు రాజగోపాల్రెడ్డిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం లావణ్య తండ్రి సుధాకరరెడ్డి, చిన్నాన్న చంద్రమౌలేశ్వరెడ్డిలతో పాటు మరో నలుగురిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఏపీలో రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఆదివారం తెల్లవారుజామున వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల కారణంగా ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతులను నెల్లూరు జిల్లా, అనంతపూర్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చిల్లకూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను అతి వేగంలో ఉన్న కారు వచ్చి ఢీకొట్టింది. కంటైనర్ను వెనుక నుంచి ఢీకొనడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇక, వీరంతా అరుణాచలం నుంచి దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని నెల్లూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.మరోవైపు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఘెర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలో లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతులను అనంతపురం స్టాలిన్ నగర్కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్. పవన్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి -
బరితెగించిన పచ్చ బ్యాచ్.. మహిళలు, చిన్నారులపై దాడి
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ మూక రెచ్చిపోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎల్లో బ్యాచ్ అరాచకం సృష్టించింది.ప్రకాశం జిల్లాలోని పొదిలిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించి దాడులు చేశారు. పొదిలిలోని నవామిట్టలో వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా క్రూరత్వంతో రాళ్లు, కర్రలతో కొట్టారు. పచ్చ మూక దాడిలో కుటుంబంలోని ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వారికి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీసు స్టేషన్కు వెళ్లగా అక్కడ వారిని అడ్డుకొని వీరంగం సృష్టించారు. ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్తోనే.. -
డెహ్రాడూన్లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. డెహ్రాడూన్లో ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్ చేసి.. డెహ్రాడూన్ మూడో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచాయన్నారు. ట్రాన్సిట్ వారెంట్పై విజయవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతా రివర్స్: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు. -
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.పూడ్చిపెట్టి.. పైన కంప వేసి.. శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు. -
ట్రాక్టర్తో తొక్కించి దళిత కూలీ హత్య
నాగులుప్పలపాడు: అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు ఓ దళిత కూలీని ట్రాక్టర్ గొర్రుతో తొక్కించి హత్య చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రమాదంగా చిత్రీకరించి, స్టేషన్ బెయిలుపై వచ్చేసిన వైనం వెలుగు చూసింది. కూలి డబ్బు వద్ద తలెత్తిన వివాదాన్ని మనసులో పెట్టుకొని ఈ దురాగతానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కె.తక్కెళ్లపాడుకు చెందిన కొప్పుల రామయ్య (65) రైతుల వద్ద కూలి పనులు చేసుకొనేవాడు. భార్య చనిపోవడంతో కుమార్తె వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలోని అగ్రవర్ణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కురుగుంట్ల రాఘవయ్య వద్ద కూడా కూలి పనిచేసేవాడు. కొద్ది రోజుల క్రితం కూలి విషయంలో రాఘవయ్యతో గొడవ జరిగింది. ఓ దళిత కూలీ నన్ను ప్రశి్నస్తాడా అని రాఘవయ్య కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మనపాలెం నుంచి తక్కెళ్లపాడుకు మోటార్ సైకిల్పై వెళ్తున్న రామయ్యను రాఘవయ్య ట్రాక్టర్ గొర్రుతో తొక్కేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన ట్రాక్టర్ను పొలాల్లో దాచిపెట్టాడు. అనంతరం తీవ్ర గాయాలపాలైన రామయ్య వద్దకు అందరితో పాటు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్దాం పదండి అంటూ హడావుడి చేశాడు. రామయ్య ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. దాంతో అధికార పార్టీ అండతో ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయతి్నంచాడు. పోలీసుల విచారణలో రాఘవయ్య ట్రాక్టర్తో తొక్కించినట్లు తేలింది. రాఘవయ్యను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా పొరపాటున ప్రమాదం జరిగినట్లు ఒప్పుకున్నాడు. అయితే, తన రాజకీయ పలుకుబడితో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించి, వెంటనే స్టేషన్ బెయిల్ తీసుకుని తన ట్రాక్టర్ను కూడా విడిపించుకున్నాడు. 15 ఏళ్ల క్రితం 18 ఏళ్ల బాలికనూ ట్రాక్టర్తో తొక్కించి హత్య.. తన తండ్రిది ముమ్మాటికీ హత్యేనని రామయ్య కుమారుడు కొప్పుల కోటయ్య తెలిపాడు. ఇదే రాఘవయ్య అగ్రకుల అహంకారంతో 15 ఏళ్ల క్రితం తమ గ్రామానికే చెందిన 18 ఏళ్ల బాలికను కూడా ఇలాగే ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసి ఎలాంటి కేసు లేకుండా మాఫీ చేసుకున్నాడని ఆరోపించాడు. రాఘవయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
పచ్చ బ్యాచ్ అరాచకం.. వైఎస్సార్సీపీ ఆఫీస్ ధ్వంసం, కానిస్టేబుల్పై దాడి
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. తాజాగా జిల్లాలో పచ్చ బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది. భాకరాపేటలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి చేసి ఆఫీసులో ఉన్న ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనంతరం, కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డారు.వివరాల ప్రకారం... తిరుపతి జిల్లాలోని భాకరాపేటలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ సందర్బంగా ఆఫీసులో ఉన్న ఫర్నీచర్, ఇతర సామాన్లు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించింది. దీంతో, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త తులసిరెడ్డిని అరెస్ట్ చేశారు.ఇక, పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత ఆగ్రహానికి లోనైన తులసిరెడ్డి కానిస్టేబుల్పైనే దాడి చేశాడు. అధికారం మాది నన్నే అరెస్ట్ చేస్తారా? అంటూ రెచ్చిపోయి విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పోలీసు స్టేషన్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు.అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రం మండలం పొడరాళ్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి స్థలం కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో, వారిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ నేతలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇది కూడా చదవండి: ‘మా కలలు చిదిమేసిన చంద్రబాబు ప్రభుత్వం’